ఎమ్మెల్సీ కవిత పర్యటన: ఘన స్వాగతం పలికిన నాయకులు

తిమ్మాపూర్, జనవరి 28 (విశ్వం న్యూస్): మానకొండూర్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలంలోని చింతలకుంటపల్లి గ్రామానికి శనివారం విచ్చేసిన ఎమ్మెల్సీ కవిత కు ఘన స్వాగతం పలికిన రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్, సూడా చైర్మన్,బిఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జి.వి రామకృష్ణారావు,రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ వేణుతో పాటు ఇల్లంతకుంట మండలం ఎంపీపీ, జడ్పిటిసి, స్థానిక ప్రజా ప్రతినిధులు పార్టీ శ్రేణులు. అనంతరం చింతలకుంటపల్లి గ్రామoలో ఇటీవల మృతి చెందిన తమ సమీప బంధువయిన తన్నీర్ లక్ష్మి భాయి చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘన నివాళులు అర్పించారు.
