విజయ్ దేవరకొండ – పరశురామ్ లతో దిల్ రాజు కొత్త సినిమా

హైదరాబాద్, ఫిబ్రవరి 6 (విశ్వం న్యూస్) : గీత గోవిందం’తో బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అనిపించుకున్న విజయ్ దేవరకొండ – పరశురామ్ కాంబోలో మరో చిత్రం రానుంది. శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బ్లాక్బస్టర్ గీత గోవిందం తర్వాత విజయ్ మరియు పరశురామ్ల కలయికలో ఇది రెండవది.