ప్రమాదవశాత్తు బావిలో పడి ఇద్దరికీ తీవ్ర గాయాలు

తిమ్మాపూర్, జనవరి 3 (విశ్వం న్యూస్) : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపెల్లి గ్రామంలో మంగళవారం వ్యవసాయ బావిలో పూటిక తీయడానికి అదే గ్రామానికి చెందిన బీనపల్లి రాజు, దామ అంజయ్య అనే వ్యక్తులు క్రేన్ సహాయం తో బావిలోకి దిగుతుండగా ప్రమాదవశాత్తు క్రేన్ వైరు తెగి బావిలో పడడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలైనయీ. వెంటనే స్థానికులు గుర్తించి క్షతగాత్రులను బావి నుండి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.