ప్రత్యేక పూజలో కాటన్ మిల్లర్స్ యజమాని అయిత యుగేందర్ దంపతులు

ఆంజనేయ స్వామి మరియు విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రముఖ కాటన్ మిల్లర్ యజమాని అయిత యుగేందర్ దంపతులు
జమ్మికుంట, పిబ్రవరి 18 (విశ్వం న్యూస్) : జమ్మికుంట పట్టణ సమీపంలోని రంగమ్మ పల్లి జగ్గయ్యపల్లి మధ్యలో ఉన్నటువంటి అంజనేయ స్వామి, పుట్ట నాగేంద్ర స్వామి ఆలయం, విశ్వేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రముఖ కాటన్ మిల్లర్స్ యజమాని అయిత యుగంధర్ దంపతులు, జమ్మికుంట పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి మంజునాథ కాటన్ ఇండస్ట్రీస్, అయిత యుగేందర్ మరియు అయిత మోహన్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగమ్మ పల్లి, జగ్గయ్యపల్లి మధ్యలో ఉన్నటువంటి ఆంజనేయ మరియు విశ్వేశ్వర స్వామి, పుట్ట నాగేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలోని గ్రామ సర్పంచ్ వంశీధర్ దంపతులు, మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గుడి ప్రాంగణంలో వేద పండితుల మధ్య ప్రత్యేక పూజలు రంగ రంగ వైభవంగా నిర్వహించారు.