రైతుల సేవలకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి:మంత్రి నిరంజన్ రెడ్డి

మార్కెటింగ్ ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలి
పంటల కొనుగోళ్లలో మార్కెటింగ్ ఉద్యోగుల సేవలు ప్రశంసనీయం
రైతులకు సేవలను ఎప్పటిలాగే కొనసాగించాలి
హైదరాబాద్, జనవరి 2 (విశ్వం న్యూస్) : హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో మంగళవారం టిఎన్జీవో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల కేంద్ర సంఘం 2023 డైరీ మరియు క్యాలెండర్ విడుదల చేసిన రాష్ట్ర వ్యవసాయ సహకార మరియు మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో టీఎన్జీఎస్ సెంట్రల్ యూనియన్ అధ్యక్షులు శ్రీ మామిళ్ళ రాజేందర్ గారు కార్యదర్శి శ్రీ ప్రతాప్ గారు మార్కెటింగ్ సంచాలకులు శ్రీమతి లక్ష్మీబాయి గారు అడిషనల్ డైరెక్టర్లు లక్ష్మణుడు మరియు రవికుమార్ గారు టిఎన్జిఎస్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల కేంద్ర సంఘం అధ్యక్షులు చిలక నరసింహారెడ్డి గారు కార్యదర్శి ఫస్యుద్దిన్ మరియు అన్ని జిల్లాల అధ్యక్షులు కార్యదర్శులు మరియు సెంట్రల్ ఫోరం కార్యవర్గం మరియు మార్కెట్ కమిటీ ఉద్యోగులు పాల్గొనడం జరిగింది.