జమ్మికుంట:నిరుపేద కుటుంబానికి
నిత్యవసర సరుకుల పంపిణీ

NSUI అధ్యక్షుడు మొహమ్మద్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో
జమ్మికుంట, మే 19 (విశ్వం న్యూస్) : ఈరోజు జమ్మికుంట పట్టణంలోని శాలవాడలో నివసిస్తున్న ఎండి వసీమా భర్త చనిపోవడం జరిగింది. ఆమెకు ఒక ఆడపిల్ల ఆమె బాలికల ఉన్నత పాఠశాలలో అటెండర్ గా పనిచేసేది రెగ్యులర్ అటెండర్లు రావడం వల్ల ఆమె జాబ్ తీసివేయడం జరిగింది. ఇప్పుడు ఇంట్లో తినడానికి కూడా ఏమీ లేకపోవడంతో మా ఈ జనసేవ సమితి ని ఆశ్రయించడం జరిగింది దానికి మా వంతు కృషితో రైస్ బ్యాగ్ మరియు కొన్ని నిత్యవసర సరుకులు, కూరగాయలు, ఇంటికి సంబంధించిన కొన్ని వస్తువులు పంపిణీ చేయడం జరిగింది.
అనంతరం ఎండి వసీమ మరియు ఎండి నీలు మాట్లాడుతూ మాకు ఈ సహాయం చేసినందుకు జనసేన సమితికి ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు ఆరోగ్యం బాలేక జాబ్ చేయలేని పరిస్థితులలో మేము ఉన్నాము ఎవరైనా ఇస్తేనే తినే పరిస్థితిలో మేమున్నాము కాబట్టి ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మాకు సహాయం చేయాలని అని కోరుకున్నారు.
అనంతరం జన సేవా సమితి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్రాన్ మాట్లాడుతూ ఇంకా ఎవరైనా జమ్మికుంటలోని ధనవంతులు మరియు రాజకీయ నాయకులు ఎవరైనా వీరికి సహాయం చేయాలని కోరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేవ సమితి వెల్ఫేర్ అధ్యక్షులు ఎండి ఇమ్రాన్ మరియు ఉపాధ్యక్షులు పల్నాటి అభిలాష్, సబ్బని విశ్వ, శేఖర్ ,ఎండి వసీమా ఎండీ నిలు తదితరులు పాల్గొన్నారు.