బీఆర్ఎస్ఎల్పీ నేతగా కేసీఆర్

హైదరాబాద్, డిసెంబర్ 09 (విశ్వం న్యూస్): బీ ఆర్ ఎస్ ఎల్పీ నేత గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏక గ్రీవంగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు. బీ ఆర్ ఎస్ పీ పి నేత కేశవరావు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ పేరును ప్రతిపాదించగా మాజీ మంత్రులు శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి బలపరిచారు. శాసనా సభాపక్షం మిగతా కమిటీ ని ఎంపిక చేసే భాద్యతను కేసీఆర్ కు అప్పగిస్తూ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది.