మంత్రి శ్రీధర్ బాబు మేనత్త సువర్ణ వనమాల కన్నుమూత

మంత్రి శ్రీధర్ బాబు మేనత్త
సువర్ణ వనమాల కన్నుమూత

మంథని, జూలై 20 (విశ్వం న్యూస్): పెద్దపల్లి జిల్లా మంథని మాజీ సర్పంచ్ సువర్ణ చంటయ్య సతీమణి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మేనత్త సువర్ణ వనమాల (91) సోమవారం కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు.

సువర్ణ వనమాల మరణ వార్తతో కుటుంబ సభ్యులు, బంధువులు, మంథని ప్రాంత ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె అంతిమ యాత్ర జూలై 21 (మంగళవారం) ఉదయం 6 గంటలకు మంథనిలోని రావుల చెరువు కట్ట వద్ద ఉన్న స్వగృహం నుంచి ప్రారంభమై, గోదావరి తీరంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

సంతాపం తెలిపిన మంత్రి శ్రీధర్ బాబు : తన మేనత్త సువర్ణ వనమాల మృతి పట్ల మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, సువర్ణ వనమాల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆమె సేవలను, కుటుంబానికి అందించిన విలువలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *