కమిషనర్ ను పండుగకు ఆహ్వానించిన
గౌడ సంఘం నాయకులు

కరీంనగర్ బ్యూరో, ఏప్రిల్ 21 (విశ్వం న్యూస్) : ఈనెల 25న కరీంనగర్ లో జరగనున్న శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి బోనాల పండుగ కు హాజరు కావాల్సిందిగా పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బరాయుడుని కరీంనగర్ గౌడ సంఘం నాయకులు ఆహ్వానించారు.
శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి బోనాల పండుగ ఉత్సవం కోసం మాజీ కౌన్సిలర్ రజిత ప్రసాద్ గౌడ్ అధ్వర్యంలో గౌడ కులస్తుల తో కలిసి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమం లో తాళ్ళపెళ్లి హరిప్రసాద్ గౌడ్, పంజాల సురేందర్ గౌడ్, పంజాల కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయ నిర్వాహకులు కోడూరి మహేందర్ గౌడ్ తెలిపారు.