మంత్రులకు శుభాకాంక్షలు
తెలియజేసిన నేతలు

బోడుప్పల్, మే 1 (విశ్వం న్యూస్) : ప్రపంచ చరిత్రపుటల్లో లిఖించదగ్గ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగుల చిత్రపటం అదేవిధంగా ఆదివారం అనగా 30 ఏప్రిల్ 2023 రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నూతన సచివాలయం (నామకరణం) మెయిన్ ముఖద్వారాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ మేరకు మంత్రులు చామకూర మల్లారెడ్డి, మహమ్మద్ అలీలకు తమ నూతన సచివాలయ మంత్రుల చాంబర్లలో ఆసీనులైన సందర్భంగా.. ఘనంగా సన్మానించి, పుష్పగుచ్చం అందజేసి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ జీవీఆర్, కార్పొరేటర్లు మద్ది యుగంధర్ రెడ్డి, సింగిరెడ్డి పద్మా రెడ్డి తదితరులు హాజరయ్యారు.