ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

కరీంనగర్, జనవరి 26 (విశ్వం న్యూస్) : 74వ గణతంత్ర దినోత్సవం పురస్కారించుకోని కరీంనగర్ పట్టణంలోని అరుంధతి నగర్ లో కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా నాయకులు దీకొండ శేఖర్ ఆధ్వర్యంలో జెండా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పిసిసి రాష్ట్ర కార్యదర్శి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం కోఆర్డినేటర్ వైద్యుల అంజన్ కుమార్ గారు పతాక ఆవిష్కరిణ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ ,ఎస్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు కుర్రపోచయ్య యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు హైమాద్ గారు వసీం గారు సిటీ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు సర్వర్ చోటు సర్వర్ ఖాన్ అంజు వాజిద్ సంతోష్ , నరేందర్ , రజనీకాంత్ , నరేష్ , సీనియర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
