ఇల్లు కట్టుకునే వారికి
రూ.5లక్షలు: భట్టి విక్రమార్క

హైదరాబాద్, ఫిబ్రవరి 10 (విశ్వం న్యూస్) : ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల సాయం అందిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.
‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గత ప్రభుత్వం నిధులను వినియోగించుకోలేదు. వాటిని రాబట్టి ఎక్కువ మందికి లబ్ది చేకూరుస్తాం. ఈ ఏడాది ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేస్తాం.
ఈ పథకానికి బడ్జెట్లో 7740 కోట్లు కేటాయిస్తున్నాం’ అని ప్రకటించారు.