
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఆ రాష్ట్ర విత్తమంత్రి భట్టి విక్రమార్క శనివారం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇది పూర్తిస్థాయి బడ్జెట్ కాకపోవడంతో ఎలాంటి ఆకర్షణీయమైన ప్రకటనలు, పథకాలకు అవకాశం లేకుండానే బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్ రూ.2,75,894 కోట్లుగా మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
ఆయా శాఖలకు కేటాయింపులు ఇలా..
రెవెన్యూ వ్యయం రూ. 2,01,178 కోట్లు
మూలధన వ్యయం రూ. 29,669 కోట్లు
నీటిపారుదల శాఖకు రూ. 28,024 కోట్లు
వ్యవసాయ శాఖకు రూ. 19,746 కోట్లు
విద్యారంగానికి రూ. 21,389 కోట్లు
వైద్యారోగ్య రంగానికి రూ. 11,500 కోట్లు
గృహజ్యోతి పథకానికి రూ. 2,418 కోట్లు
ట్రాన్స్కో, డిస్కమ్లకు రూ. 16,825 కోట్లు
గృహ నిర్మాణ శాఖకు రూ. 7,740 కోట్లు
పరిశ్రమల శాఖకు రూ. 2,543 కోట్లు కేటాయింపు..
ఐటీ శాఖకు రూ. 774 కోట్లు కేటాయింపు
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 40,080 కోట్లు
పురపాలక శాఖకు రూ. 11,692 కోట్లు
మూసీ నది అభివృద్ధి కోసం రూ. 1000 కోట్లు
ఎస్సీ గురుకులాల భవన నిర్మాణాలకు రూ. 1000 కోట్లు
ఎస్టీ గురుకులాల భవన నిర్మాణాలకు రూ. 250 కోట్లు
ఎస్సీ సంక్షేమానికి రూ. 21,874 కోట్లు
ఎస్టీ సంక్షేమానికి రూ. 13,313 కోట్లు
మైనార్టీ సంక్షేమానికి రూ. 2,262 కోట్లు
బీసీ గురుకులాల స్వంత భవనాల నిర్మాణానికి రూ. 1,546 కోట్లు
బీసీ సంక్షేమానికి రూ. 8,000 కోట్లు