తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు

తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు

హైదరాబాద్, మార్చి 12 (విశ్వం న్యూస్) : తెలంగాణ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ముగిసింది. రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించే పథకాలపై కేబినెట్ చర్చించారు. ఇందులో భాగంగా కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే రాష్ట్రంలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.22,500 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపింది.

*4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల కోసం 22,500 కోట్లు.
*ప్రతీ నియోజక వర్గానికి 3500 ఇల్లు. లబ్ది దారులను గ్రామ సభల్లో ఎంపిక.
*కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరుకు కేబినెట్ ఆమోదం.
*అర్హులైన ప్రతీ ఒక్కరికీ తెల్ల రేషన్ కార్డుల మంజూరు.
*16 బీసీ , ఎస్సీ , ఎస్టీ కార్పొరేషన్ల ఏర్పాటు.

  1. ముదిరాజ్ కార్పొరేషన్
  2. యాదవ కురుమ కార్పొరేషన్
  3. మున్నూరుకాపు కార్పొరేషన్
  4. పద్మశాలి కార్పొరేషన్
  5. పెరిక (పురగిరి క్షత్రియ) కార్పొరేషన్
  6. లింగాయత్ కార్పొరేషన్
  7. మేరా కార్పొరేషన్
  8. గంగపుత్ర కార్పొరేషన్ ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (EBC)
  9. ఈబీసీల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు
  10. ఆర్య వైశ్య కార్పొరేషన్
  11. రెడ్డి కార్పొరేషన్
  12. మాదిగ, మాదిగ ఉప కులాల కార్పొరేషన్
  13. మాల, మాల ఉప కులాల కార్పొరేషన్

    మూడు ప్రత్యేక కార్పోరేషన్లు ఏర్పాటు
    • కొమురం భీమ్ ఆదివాసి కార్పోరేషన్
    • సంత్ సేవాలాల్ లంబాడి కార్పోరేషన్
    • ఏకలవ్య కార్పోరేషన
    • మహిళా సాధికారితలో భాగంగా మహిళల కోసం ఔటర్ రింగురోడ్డు చుట్టు మహిళా రైతు బజార్లు ఏర్పాటు (మహిళలే రైతు బజార్లు నిర్వహిస్తారు)
    • అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు
    • ఆరోగ్య శ్రీరేషన్ కార్డుకు ఎలాంటి సంబంధం లేదు
    • ఇకనుంచి రేషన్ కార్డు పూర్తిగా నిత్యావసర సరుకులకు మాత్రమే ఉపయోగపడుతుంది
    • 92 శాతం రైతులకు వచ్చే మూడు రోజుల్లో రైతుభరోస పూర్తవుతుంది.
    16 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం
    *ముదిరాజ్, యాదవ కుర్మ, లింగాయత్, పద్మశాలి, పెరక, బలిజ కార్పొరేషన్ల ఏర్పాటు
    *రెడ్డి, వైశ్య, మాదిగ, మాదిగ ఉపకులాల, మాల, మల ఉపకులాల కార్పొరేషన్ల ఏర్పాటు
    8ఏకలవ్య, బంజారా, ఆదివాసీ ల కోసం ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటు
    *గీత కార్మికుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు
    *స్వయం సహాయక సబుగాల ఉత్పత్తుల మార్కెటింగ్ కు ఓ.ఆర్.ఆర్ పరిధిలో 25 ఎకరాల స్థలంలో వసతి (కాంప్లెక్స్ ) ఏర్పాటు.
    *వచ్చే ఐదేళ్ళలో స్వయం సహాయక మహిళలను కోటీశ్వరులుగా చేసేందుకు 15 అంశాలతో కూడిన మహిళా శక్తి ప్రత్యేక పధకం ఏరాటు.
    *2008 డీఏస్సీ అభ్యర్థులకు మినిమం పే స్కేల్ (టైం స్కెల్ ) ఇచ్చి ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయం
    *వేసవిలో తాగునీటి కోసం ఇబ్బంది లేకుండా జాగ్రత్త తీసుకోవాలని అధికారులను ఆదేశించిన క్యాబినెట్
    *గత ప్రభుత్వంలో జరిగిన ఇరిగేషన్ అవకతవకలపై విచారణ కోసం జస్టిస్ పినాకిని చంద్ర ఘోష్ తో కమిటీ.
    *విధ్యుత్ రంగంలో అవకతవకలపై జస్టిస్ ఎల్. నర్సింహా రెడ్డి అధ్యక్షతన కమీటీ.
    *100 రోజుల్లో విచారణ పూర్తి చేయాలని కోరాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *