ఫ్లాష్.. ఫ్లాష్… బిగ్ బ్రేకింగ్… మావోయిస్టు నేత హిడ్మా మృతి ?

నక్సల్స్, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు
తిమ్మాపూర్, జనవరి 11 (విశ్వం న్యూస్) : బీజాపూర్ జిల్లాలో సుక్మా, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో సర్జికల్ స్ట్రైక్ జరుగుతున్నట్లు సమా చారం. బుధవారం నక్సలైట్ కమాండర్ హిద్మా లక్ష్యంగా ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు వినికిడి. ఈ ఆపరేషన్లో హెలికాప్టర్ను ఉపయోగించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. భద్రతా బలగాల చర్యలోనూ నక్సలైట్లకు భారీ నష్టం వాటిల్లినట్లు అంచనా. దీనిపై అధికారిక ధృవీకరణ, సమాచారం లేదు.
పోలీస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం…
సుక్మా జిల్లా పరిధిలో నక్సల్స్ వ్యతిరేక ప్రచారానికి సంబంధించి కొంత సమాచారం ప్రచారంలో ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంలో, ప్రస్తుత పరిస్థితిలో, భద్ర తా దళాల సభ్యులందరూ సురక్షితంగా ఉన్నారని, ఎటువంటి అవాంఛనీయ పరిస్థితి లేదు. ఈ విష యంపై సవివరమైన సమాచారం త్వరలో విడిగా జారీ చేయబడుతుంది అని పి.సుందర్రాజ్ఐ .జి బస్తర్ తెలిపారు.